వినాయక్ దేశాయ్, అపర్ణాదేవి జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధా మాధవం’. దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గోనాల్ వెంకటేష్ నిర్మించారు. మార్చి 1న ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. హృద్యమైన ప్రేమకథగా మెప్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్కు మంచి స్పందన లభిస్తున్నది’ అని చెప్పారు. గ్రామీణ నేపథ్య ఫీల్గుడ్ లవ్స్టోరీగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని, చక్కటి నిర్మాణ విలువలతో తెరకెక్కించామని నిర్మాత గోనాల్ వెంకటేష్ పేర్కొన్నారు.