టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఎవరు మీలో కోటీశ్వరులు వంటి రియాలిటీ షోకు హోస్ట్గా ఉన్నారు.ఈ షోకు సంబంధించిన ప్రోమోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. ఇక రామ్ చరణ్ గెస్ట్గా వచ్చిన ఎపిసోడ్ కూడా మంచి ఆదరణ దక్కించుకుంది
ప్రస్తుతం ఈ షో సక్సెస్ ఫుల్గా సాగుతుండగా, మంగళవారం ఎపిసోడ్లో ఎన్టీఆర్ తనకు చాలా ఇష్టమైన క్రికెట్ ఆటను తన తండ్రి హరికృష్ణ ఆసక్తి లేకుండగా చేశారని చెప్పుకొచ్చాడు. ‘నాకు క్రికెట్ ఆడటమంటే చాలా ఇష్టం. కానీ క్రికెట్ను టీవీలో చూడటానికి అసలు ఇష్టపడను. దానికి కారణం మా నాన్నఅని పేర్కొన్నారు.
చిన్నప్పుడు టీవీలో వచ్చే క్రికెట్ మ్యాచ్ని వీసీఆర్ లో రికార్డ్ చేయమనేవారు. అది ఎలా చేయోలో కూడా నేర్పించారు. అయితే రికార్డ్ చేయడం కోసం మ్యాచ్ని పూర్తిగా చూడాల్సి వచ్చేది. మళ్లీ సాయంత్రం నాన్నతో కలిసి అదే మ్యాచ్ చూసేవాడిని. అలా చూసిచూసి చివరకు క్రికెట్ అంటే బోర్ కొట్టేసిందని ఎన్టీఆర్ స్పష్టం చేశాడు.
జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి రామ్చరణ్తో కలిసి ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ కోసం నందమూరి అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా ఇటీవల స్టార్ట్ చేశారు. మొదటి పాట తోనే సినిమాకు భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేశారు.