Pushpa The Rule | టాలీవుడ్లో రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమాల్లో ఒకటి ‘పుష్ప.. ది రూల్’ (Pushpa The Rule). సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన పుష్ప.. ది రైజ్కు సీక్వెల్గా వస్తున్న ఈ మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుష్పరాజ్గా మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు మేకర్స్. ఈ సందర్భంగా పుష్ప రాజ్ తన రూల్ను ప్రారంభించడానికి ఇంకా 200 రోజులు మిగిలి ఉందంటూ మేకర్స్ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్లో ఒక కొండపై పులి కనిపిస్తున్నట్లు ఉంది. కాగా ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్గా మారింది.
పుష్ప.. ది రూల్ కోసం రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ నుంచి ఫస్ట్ పార్టును మించిపోయే మరో చార్ట్ బస్టర్ ఆల్బమ్ రాబోతుందని ఇన్సైడ్ టాక్. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తోంది. ఫస్ట్ పార్టులో శ్రీవల్లిగా నటించిన కన్నడ సోయగం రష్మిక మందన్నా సీక్వెల్లో మరోసారి ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించనుంది.
200 DAYS for Pushpa Raj to begin his RULE 🔥🔥#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024 ❤🔥#PushpaKaRuleIn200Days 💥💥
Icon Star @alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @kamal_61 @MythriOfficial @SukumarWritings @TSeries #ICONStAAr pic.twitter.com/3EJ4a7muzB
— BA Raju’s Team (@baraju_SuperHit) January 29, 2024