Pushpa The Rule | ‘బాహుబలి’ చిత్రం తర్వాత ఆ స్థాయిలో పరభాషలో ఆకట్టుకున్న చిత్రం ‘పుష్ప’. ఎలాంటి ప్రమోషన్లు లేకుండానే ఈ చిత్రం హిందీలో 100కోట్ల కలెక్షన్లను రాబట్టి బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. అల్లుఅర్జున్ తన నటన, మ్యానరిజంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. సినీ ప్రముఖలు నుంచి క్రికెట్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వరకు బన్నీ మేనరిజమ్స్ ఫాలో అయ్యారు. ఈ చిత్రంలో సుకుమార్ టేకింగ్ అయితే నెక్స్ట్ లెవల్ అన్నట్లు ఉంటుంది. గతేడాది డిసెంబర్17 న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచి పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పోటీగా ’83’, ‘స్పైడర్ మ్యాన్ నోవే హోమ్’ వంటి సినిమాలున్న వాటిని అధిగమించి పుష్ప భారీ వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ‘పుష్ప ది రూల్’ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘పుష్ప ది రూల్’ చిత్రం కోసం హిందీ నుంచి భారీగా ఆఫర్స్ వస్తున్నాయట. బాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్, డిస్ట్రీబ్యూటింగ్ సంస్థ ‘గోల్డ్ మైన్’ సినిమాస్ పుష్ప సెకండ్ పార్టు కోసం దాదాపు 100 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. పుష్ప మొదటి భాగాన్ని ఈ సంస్థ 20కోట్లకు విక్రయించింది. ఫైనల్గా పుష్ప 80కోట్ల నెట్ కలెక్షనను సాధించి 400% లాభాలను గోల్ట్మైన్ సంస్థ దక్కించుకుంది. ఈ క్రమంలోనే పుష్ప చిత్రానికి ఇప్పుడున్న డిమాండ్ మేరకు గోల్ట్మైన్ సంస్థ ఇంత మొత్తం ఆఫర్ చేసినట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించాడు. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించాడు. రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రంతో బన్నీ నార్త్లో విపరీతమైన ఫాలోయింగ్ను ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం సెకండ్ పార్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ ఏడాది ద్వితియార్థంలో సెకండ్ పార్ట్ విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.