ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రాలలో పుష్ప ఒకటి. అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’కాగా, ఇది రెండు భాగాలుగా రూపొందనుంది. అందులో తొలి భాగం ‘పుష్ప ది రైజ్’ విడుదలకు సన్నద్ధమవుతుంది.
కొద్ది రోజుల క్రితం పుష్ప చిత్రం క్రిస్మస్ కానుకగా విడుదల కానుందని తెలియజేశారు. అయితే డేట్పై పలు ప్రచారాలు జరుగుతున్న వేళ, మేకర్స్ పుష్ప చిత్రాన్ని డిసెంబర్ 17న విడుదల చేయనున్నట్టు పోస్టర్ ద్వారా తెలియజేశారు. డిసెంబర్ 25న విడుదల చేయాలని ముందుగా భావించగా, భారీ బడ్జెట్ చిత్రాలు ఆ రోజు విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ డేట్ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
ఈ చిత్రంలో బన్నీకి జోడీగా శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల రష్మిక పాత్రకు సంబంధించిన లుక్ విడుదల చేస్తూ, సినిమాలో రష్మిక పాత్ర పేరు శ్రీవల్లి అని తెలియజేశారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందతుంది.