‘పుష్పరాజ్ ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేసే ఓ దొంగ. ఎదుటివాడు ఎంతటి బలవంతుడైనా తన తెలివితేటలు, ధైర్యంతో బోల్తా కొట్టిస్తుంటాడు. తగ్గెదేలే అనే తత్వం ఉన్న అతడికి భన్వర్సింగ్ షెకావత్ అనే ఐపీఎస్ అధికారితో ఎందుకు వైరం ఏర్పడిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు సుకుమార్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పుష్ప’(ది రైజ్). అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా పతాకాలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 17న ఈ సినిమాను విడుదలచేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. చిత్తూరు బ్యాక్డ్రాప్లో యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న చిత్రమిది. తొలి భాగాన్ని డిసెంబర్ 17న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలచేస్తున్నాం’ అని తెలిపారు. ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావురమేష్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్.