
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,గ్లామరస్ బ్యూటీ రష్మిక ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతుంది. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవులలో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేశారు. వందల మంది ఫైటర్ల తో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్టు సమాచారం.
అయితే చాన్నాళ్లపాటు మారేడుమిల్లి అడవులలో షూటింగ్ జరగగా, ఎవరు కూడా పర్యావరణానికి హాని కలిగించకూడదని బన్నీ ముందుగానే పలు సూచనలు చేశారు. ఇది తాజాగా విడుదలైన మేకింగ్ వీడియోలో చూపించారు. మనం తెచ్చుకున్న టీ కప్స్, పేపర్ ప్లేట్స్ అన్నీ కూడా డస్ట్ బిన్లోనే వేద్దాం. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అని అన్నారు. అలానే వీడియో ద్వారా రేపు ట్రైలర్ రిలీజ్ కానుందంటూ మరోమారు గుర్తు చేశారు.
డిసెంబర్ 17న విడుదల కానున్నఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో అయిన ఫాహద్ ఫాసిల్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. అనసూయ భరద్వాజ్ మరియు జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
The team's blood and sweat to give you the best 🤘
— Mythri Movie Makers (@MythriOfficial) December 5, 2021
You will witness it tomorrow 🔥
PUSHPA TRAILER ON DEC6TH 🔥
▶️ https://t.co/w1qMAYWlQx#PushpaTheRise #ThaggedheLe 🤙#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic @PushpaMovie pic.twitter.com/39OcTjAXXV