తిరుపతి : పుష్ప చిత్రబృందం బుధవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో దర్శకుడు సుకుమార్, నిర్మాత నవీన్, నటుడు సునీల్ స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. అర్చకులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మీడియాతో మాట్లాడారు. పుష్ప చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు దర్శకుడు ధన్యవాదాలు తెలిపారు. పుష్ప -2 నిర్మాణాన్ని ఫిబ్రవరి నుంచి ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.