అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాలోని అధిక భాగం షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని మారేడు మిల్లి అడవుల్లో పూర్తి చేసింది చిత్రబృందం. చిత్రంలోని సన్నివేశాలు కనుల పండుగగా ఉంటాయని తెలుస్తుంది. డిసెంబర్ 17న చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేయగా, ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.
చిత్రం నుండి పాత్రలకు సంబంధించిన పోస్టర్స్ తో పాటు పాటలు విడుదల చేస్తున్నారు. దాక్కో దాక్కో మేక మంచి ఆదరణ దక్కించుకోగా, ఇటీవలే చూపే బంగారమాయేనే శ్రీవల్లీ అనే లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటను సింగర్ సిద్ శ్రీరామ్ పాడారు. సామి సామి పాటకు కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలోని నాలుగో పాటను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.
‘ఏ బిడ్డా.. ఇది నా అడ్డా’ అనే పాటను నవంబరు 19న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి విడుదలైన పోస్టర్లో పుష్పరాజ్ కాస్త డిఫరెంట్గా కనిపిస్తున్నారు. చూస్తుంటే ఈ పాట వాటిని మించి ఉండేలా కనిపిస్తుందని అంటున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో నడిచే ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను రెండు పార్ట్స్గా తెరకెక్కిస్తుండగా.. మొదటి భాగమైన ‘పుష్ప ది రైజ్’ను డిసెంబరు 17న థియేటర్లలో విడుదల చేయనున్నారు.