నార్కట్పల్లి, మే 31: సాంకేతిక లోపంతో ఆగి ఉన్న బస్సును ఆర్టిస్టులతో వెళ్తున్న పుష్ప-2 యూనిట్ బస్సు ఢీకొట్టింది. దాంతో ఇద్దరు ఆర్టిస్టులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్పల్లి వద్ద బుధవారం తెల్లవారుజామున 65వ జాతీయ రహదారిపై జరిగింది. ఎస్ఐ సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఖమ్మం నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా 65వ జాతీయ రహదారిపై నార్కట్పల్లి వద్ద సాంకేతిక లోపంతో ఆగిపోయింది.
పుష్ప2 యూనిట్ బస్సు ఆర్టిస్టులతో భద్రాచలం అడవుల్లో షూటింగ్ ముగించుకొని తిరిగి హైదరాబాద్కు వెళ్తున్న సమయంలో రోడ్డుపై ఉన్న బస్సును అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు మరో వాహనంలో యూనిట్ సభ్యులను హైదరాబాద్కు తరలించారు. రెండు బస్సులు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ట్రాఫిక్కు అంతరాయం జరుగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు నియంత్రించారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.