Pushpa The Rule | ఇటీవలే పుష్ప పుష్ప పుష్ప రాజ్ అంటూ తొలి లిరికల్ సాంగ్తో ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను అలరించి.. యూట్యూబ్ వ్యూస్లో ఆల్ టైమ్ రికార్డులు నెలకొల్పిన పుష్ప-2 ది రూల్లోని పుష్పరాజ్ టైటిల్ సాంగ్ ఇంకా అంతటా మారుమోగుతూనే వుంది.. ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండ్లో ఉండగానే.. ఇప్పుడు తాజాగా మరో లిరికల్ అప్డేట్ను ఇచ్చారు పుష్ప -2 మేకర్స్.. ఈ సారి చిత్రంలోని హీరోయిన్ శ్రీవల్లి వంతు వచ్చింది.
పుష్పరాజ్ జోడి అయిన శ్రీవల్లి పుష్పరాజ్తో కలిసి పాడుకున్న మెలోడి సాంగ్ను కపుల్ సాంగ్గా నెల 29న ఉదయం 11:07 నిమిషాలకు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను నేడు విడుదల చేశారు మేకర్స్. ప్రోమోలో కేశవ వాయిస్తో సెకండ్ సాంగ్ గురించి రష్మికను అడుగుతాడు. మేకప్ వేసుకునేందుకు సిద్దంగా వున్న శ్రీవల్లి సూసేకి అగ్గిరవ్వ మాదిరి వుంటాడే నా సామీ వుంటాడే నా సామి అంటూ ఆమె పాడుతూ ఐకానిక్ స్టెప్పుతో అలరించింది. ఈ ప్రోమో చూసి సాంగ్ అదిరిపోయే మెలోడిలా వుండబోతుందని అందరూ అంచనా వేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప-2 ది రూల్. పుష్ప ది రైజ్తో ప్రపంచ సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకోవడమే ఇందుకు కారణం. ఈ చిత్రంలో ఐకాన్స్టార్ అల్లు అర్జున్ నటనకు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అందరూ ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి సన్నేషనల్ కలయికలో రాబోతున్న పుష్ప-2 ది రూల్పై ప్రపంచవ్యాప్తంగా ఆకాశమే హద్దుగా అంచనాలు వున్నాయి. ఈ సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక పుష్ప ది రైజ్ చిత్రంలో తన నటనతో మొట్ట మెదటిసారిగా తెలుగు కథానాయకుడు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకోవడం, మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశ నటుడు దుబాయ్లో మేడమ్ టూస్సాడ్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం అనేవి తెలుగు వారందరికి గర్వకారణం. ఇలాంటి ప్రత్యేకతలు పుష్ప చిత్రంతోనే సంతరించుకున్నాయి. ఇక త్వరలోనే పుష్ఫ 2తో మరోక్కసారి ప్రపంచం లోని సినిమా అభిమానులంతా ఒక్కసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటవిశ్వరూపాన్ని చూడబోతున్నారు. 90 సంవత్పరాలు తెలుగు సినిమా చరిత్రలొ మొదటిసారి తెలుగు నటుడి నటన చూసేందుకు ప్రపంచ దేశాలన్ని ఎదురుచూస్తున్నాయి..
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. సంగీతం: దేవి శ్రీ ప్రసాద్.