Gango Renuka Thalli | అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పుష్ప ది రూల్’ (Pushpa 2 The Rule). పుష్ప సినిమాకు సీక్వెల్గా వచ్చిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా.. రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలో సెకండ్ ఆఫ్లో వచ్చే ‘గంగో రేణుక తల్లి’ జాతర సీక్వెన్స్ సినిమాకే హైలైట్గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ జాతర ఎపిసోడ్లో అల్లు అర్జున్ మాస్ తాండవం చేశాడు. దాదాపు 30 నిమిషాలకు పైగా ఉన్న ఈ సీన్ బన్నీ కెరీర్కు హైలెట్గా నిలిచింది. అయితే ఈ జాతర సీన్ వచ్చినప్పుడు థియేటర్లలో పలువురు మహిళలకు అమ్మవారు పూనింది. జాతర పాట వస్తుంటే.. అమ్మవారు పూనడంతో పక్క సీట్లలో ఉన్న ప్రేక్షకులు వారిని శాతింపజేశారు. కాగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి.
పుష్ప-2 జాతర సీక్వెన్స్లో మహిళలకు అమ్మవారు పునినట్లు వైరల్ అవుతున్న వీడియో pic.twitter.com/70sRDwgDAQ
— Telugu Scribe (@TeluguScribe) December 7, 2024