అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘పుష్ప-2’ సినిమా గురించి ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ గురువారం హైదరాబాద్లో మొదలైనట్లు తెలిసింది. ఇందులో ప్రధాన తారాగణం పాల్గొనగా జాతర నేపథ్యంలో యాక్షన్ ఎపిసోడ్ను తెరకెక్కిస్తున్నారని సమాచారం. కథాగమనంలో కీలకంగా వచ్చే ఈ ఎపిసోడ్ సినిమాకు హైలైట్గా నిలుస్తుందని చెబుతున్నారు. దాదాపు రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ జరగనున్నట్లు తెలిసింది.
ఈ సినిమా విషయంలో దర్శకుడు సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, చక్కటి పర్ఫెక్షన్తో అన్కాంప్రమైజ్డ్గా తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, ధనుంజయ, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది.