Puri jagannadh | మేకింగ్లో పూరీ జగన్నాథ్ స్టైలే వేరు. తక్కువ సమయంలో మంచి అవుట్ పుట్ను తీసుకురావడం ఈయనకే సాధ్యం.వారంలో కథ రాసి..రెండు మూడు నెలల్లోనే సినిమా షూట్ను పూర్తి చేసి థియేటర్లో విడుదల చేయగలడు.బిజినెస్ మ్యాన్ సినిమాతో ఇది రుజువైంది కూడా. బిజినెస్ మ్యాన్ సినిమాను కేవలం రెండు నెలల్లోనే పూర్తి చేసి హిట్ కొట్టాడు. ఇక ఇస్మార్ట్ శంకర్ తో తిరిగి ట్రాక్లోకి వచ్చిన పూరీ ప్రస్తుతం విజయ్ తో లైగర్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ కు జనగణమన కథ చెప్పినట్లు దానికి విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గత కొన్నిరోజుల నుండి ప్రచారం అవుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
ప్రస్తుతం లైగర్ షూటింగ్ దశలో ఉంది.ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దాదాపు రెండేళ్ల సమయం తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే జనగణమన కథను విజయ్తో తెరకెక్కించాలని..అంతేకాకుండా రెండు నెలల్లోనే షూటింగ్ను పూర్తి చేయాలని భావిస్తున్నాడట. లైగర్ సినిమా విడుదలకు చాలా సమయమే ఉంది కాబట్టి ఆలోపే జనగణమన షూటింగ్ను పూర్తి చేయాలని అన్ని విధాల ప్లాన్ చేస్తున్నాడట. పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన గతంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్లతో తెరకెక్కించాలని అనుకున్నాడట. కాని కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. మరి ఈ సారైన జనగణమన పట్టాలెక్కుతుందా లేదా అనేది చూడాల్సిందే. ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి పూరీ,ఛార్మి లు నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా అనన్యపాండే నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ కీలకపాత్రలో నటిస్తున్నారు.ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.