Guntur Karam | మహేశ్బాబు, త్రివిక్రమ్ల ‘గుంటూరుకారం’ సినిమా కోసం అభిమానులే కాదు, హీరోలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్గా హీరో నితిన్.. ‘గుంటూరుకారం’ నిర్మాత నాగవంశీని తన ఎక్స్(ట్విటర్)ద్వారా అడిగేశాడు కూడా. ‘గుంటూరు కారం రెండో పాట ఎప్పుడు విడుదల చేస్తున్నారు? ఇంతకీ అప్డేట్ ఎప్పుడు? మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అంటూ పోస్ట్ పెట్టాడు. దానికి నిర్మాత నాగవంశీ స్పందిస్తూ ‘ ఆ పనిలోనే ఉన్నాం నితిన్ స్వామి.. ఇంకో రెండు రోజుల్లో అద్భుతమైన వార్త చెబుతాం’ అంటూ రీ పోస్ట్ పెట్టారు.
ప్రొడ్యూసర్ నుంచి వచ్చిన ఈ అప్డేట్ మహేశ్ అభిమానులకు నిజంగా శుభవార్తే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రెండురోజుల్లో రాబోతున్న సెకండ్ సింగిల్, పక్కా మాస్గా అభిమానులకు ఫుల్ కిక్క్ ఇచ్చేలా ఉంటుందని సమాచారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. హారిక అండ్ హాసిని సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు.