MukeshBhatt on Mahesh | బాలీవుడ్ తనను భరించలేదని టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యపై హిందీ సినిమా నిర్మాత ముకేశ్ భట్ స్పందించారు. మహేశ్ బాబు అన్నదాంట్లో తప్పేమీ లేదని బుధవారం అన్నారు. ఇటీవల అడివి శేషు ఆధ్వర్యంలోని మేజర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మహేశ్ బాబు మాట్లాడుతూ బాలీవుడ్ తనను భరించలేదని చేసిన వ్యాఖ్యపై సోషల్ మీడియాలో వివాదానికి దారి తీసింది. బాలీవుడ్లోకి ప్రవేశించి తన సమయం వృధా చేసుకోలేనని చేసిన మహేశ్ బాబు.. తనను ఆ పరిశ్రమ భరించలేకపోవచ్చునన్నారు.
ఒకవేళ బాలీవుడ్ ఆయన ధర భరించలేదని భావిస్తే.. అది చాలా మంచిది. ఆయనకు ఆల్ది బెస్ట్ చెబుతున్నా. ఆయన వచ్చిన చోటే ప్రయాణం సాగించాలనుకోవడాన్ని గౌరవిస్తానన్నారు ముకేశ్భట్. ఆయన ఎంతో ప్రతిభావంతుడని, ప్రేక్షకుల్లో మహేశ్ బాబుకు మంచి గుర్తింపు ఉందన్నారు. సక్సెస్ఫుల్ హీరో, ఆయన అంచనాలను బాలీవుడ్ అందుకోలేకపోతే మహేశ్ తప్పేమీ లేదన్నారు. బాలీవుడ్ మీద మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యలను బాలీవుడ్ ప్రేక్షకులు తప్పుబడుతున్నారు.
సోషల్ మీడియాలో విమర్శలకు మహేశ్ బాబు టీం రియాక్టయింది. అన్ని భాషలు, సినిమాలపై మహేశ్కు అమిత గౌరవం ఉంది. ఆయనకు అన్ని భాషలు కూడా సమానమే. ఏండ్ల తరబడి తెలుగు సినిమాలు చేయడం వల్ల ఇతర పరిశ్రమలతో పోలిస్తే తాను టాలీవుడ్లోనే సౌకర్యంగా ఫీల్ అవుతున్నానని మాత్రమే చెప్పారని తెలిపింది.