మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా తన కొత్త ప్రాజెక్ట్ ‘టైగర్’ విడుదల తేదీని ప్రకటించింది. అడవి నేపథ్యంగా సాగిన ఈ చిత్రం పోస్టర్కు… ‘ఈ చిత్రానికి గొంతునివ్వడం ఎంతో సరదాగా అనిపించింది’ అని తన వ్యాఖ్యను జోడించి ఇన్స్టాలో ప్రియాంక పోస్ట్ చేసింది. “టైగర్’… అడవిని వీక్షకుల కండ్లముందు ఉంచుతుంది. అందులో జరిగే ప్రతి విషయాన్నీ చూపుతుంది. ప్రేమకథలు, పోరాటాలు, ఆకలి, అస్తిత్వం… ఇలా ఎన్నో అంశాలకు ఈ చిత్రంలో చోటు దక్కింది’ అని ఈ చిత్ర వివరాలను ఆ పోస్ట్లో పంచుకున్నది.
అంబ అనే పులి తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకునే ఇతివృత్తంతో సాగిన ‘టైగర్’ సినిమా ప్రస్థానం ఎనిమిదేండ్లకు పైగానే సాగింది. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఈ నెల 22న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి ప్రియాంక గొంతును అరువివ్వడం విశేషం. ఈ మధ్యలోనే తన భర్త నిక్ జోనాస్, కూతురు మాలతి మేరీతో ఉన్న వీడియోను కూడా ప్రియాంక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. తమ బాల్కనీలో వర్షంలో సంగీతం వింటున్న మరో పోస్టునూ ఆమె తన అభిమానులతో పంచుకున్నది.