Priyanka Chopra | గ్లోబల్స్టార్ ప్రియాంక చోప్రా, నిక్జొనాస్ దంపతులు సరోసగి ద్వారా తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. గతేడాది జనవరిలో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ చిన్నారికి మల్తీ మేరీ జొనాస్ చోప్రా అని నామకరణం కూడా చేశారు. ఈ ఏడాది జనవరి 15న మల్తీ మొదటి పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక.. మల్తీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
‘మల్తీ పుట్టినప్పుడు నేను ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నా. తను చాలా చిన్నది. నా చెయ్యి కంటే చిన్నగా ఉంది. డ్యూ డేట్ కంటే మూడు నెలల ముందే పుట్టింది. తనను ఇంటికి తీసుకు రావడానికి ముందు కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉంచాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా బిడ్డను కనేందుకు సరోగసిని ఎంచుకోవడం పట్ల ప్రియాంక స్పందించింది. ‘నాకు వైద్యపరమైన సమస్యలు ఉన్నాయి’ అని తెలిపింది. అయితే అవి ఏంటనేది వెల్లడించలేదు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించిన ప్రియాంక ‘బేవాచ్’తో 2017లో హాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జొనాస్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీయడంతో కొన్నేళ్ల డేటింగ్ అనంతరం కుటుంబసభ్యుల అంగీకారంతో 2018లో ఈ జంట ఒక్కటయ్యారు. వివాహమైన తర్వాత నుంచి ఆమె తన భర్త నిక్తో కలిసి లాస్ఏంజెల్స్లోనే ఉంటోంది. పలుహాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూనే బాలీవుడ్ సినిమాలు నిర్మిస్తోంది.