Priyanka Chopra | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అభిమానులకు శుభవార్త చెప్పారు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్లో సెటిలైన ఆమె.. దాదాపు మూడేళ్ల తర్వాత ఇప్పుడు భారత్కు వస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో బోర్డింగ్ పాస్కు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. ‘‘దాదాపు మూడేళ్ల తర్వాత.. ఫైనల్గా ఇంటికి వెళ్తున్నా..’’ అంటూ పోస్టు చేశారు. కాగా, సరోగసి పద్ధతిలో ప్రియాంక, నిక్ దంపతులు ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తల్లైన తర్వాత ప్రియాంక భారత్కు రావడం ఇదే మొదటి సారి. దీంతో అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించిన ప్రియాంక ‘బేవాచ్’తో 2017లో హాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జొనాస్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీయడంతో కొన్నేళ్ల డేటింగ్ అనంతరం కుటుంబసభ్యుల అంగీకారంతో 2018లో ఈ జంట ఒక్కటయ్యారు. వివాహమైన తర్వాత నుంచి ఆమె తన భర్త నిక్తో కలిసి లాస్ఏంజెల్స్లోనే ఉంటోంది. పలుహాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూనే బాలీవుడ్ సినిమాలు నిర్మిస్తోంది.