ప్రియదర్శి హీరోగా తెలంగాణ నేపథ్య కథాంశంతో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా జానపద నృత్యకారిణి నాగదుర్గ కథానాయికగా పరిచయమవుతున్నది. వంశీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సుకుమార్, నిర్మాత బన్నీ వాసు తెరకెక్కించబోతున్నారు. ఈ నెల 25న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు ‘ఇడుపు కాయితం’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలిసింది.
భార్యభర్తల అనుబంధం నేపథ్యంలో వినోదం, భావోద్వేగాల కలబోతగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారని, కథానుగుణంగా అదే టైటిల్ ఖరారు చేయబోతున్నారని ఫిల్మ్నగర్ టాక్. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.