Megastar Chiranjeevi | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నాడు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది. ఈ ఏడాది జనవరి 25న ప్రకటించిన 132 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేస్తున్నారు. అయితే నేడు పద్మ విభూషణ్ అవార్డులను ప్రదానం చేయగా.. టాలీవుడ్ అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారాన్నిఅందుకున్నాడు. సినీ రంగంలో చిరంజీవి చేసిన సేవలకుగాను ఈ అవార్డు వరించింది. ఇక ఈ వేడుకలో చిరంజీవి భార్య సురేఖతో పాటు తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపసాన ఉన్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
#WATCH | Delhi: President Droupadi Murmu confers Padma Vibhushan to Konidela Chiranjeevi in the field of Art. pic.twitter.com/dh1ehQJz8m
— ANI (@ANI) May 9, 2024