డా.రాజేంద్రప్రసాద్, అర్చన ముఖ్య తారలుగా, రూపేష్, ఆకాంక్షసింగ్ జంటగా.. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘షష్టిపూర్తి’. మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రమోషన్స్లో భాగంగా ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలను మేకర్స్ విడుదల చేశారు.
ఈ క్రమంలోనే ఆదివారం మూడో పాటను విడుదల చేశారు. ‘రాత్రంతా రచ్చే.. మరి నువ్వంటే పిచ్చే.. నీమాటే నచ్చే.. మది మరుమైల్లె విచ్చే..’ అంటూ సాగే ఈ పాటను చైతన్యప్రసాద్ రాయగా యువన్శంకర్రాజా, నిత్యశ్రీ ఆలపించారు. ఈ సందర్భంగా యువన్ శంకర్రాజా మాట్లాడుతూ ‘మా నాన్న సంగీత దర్శకత్వంలో ఈ తెలుగు పాట పాడినందుకు ఆనందంగా ఉంది.
తెలుగులో నేను పాడిన తొలి పాట ఇది. ఇది చాలా కూల్ సాంగ్. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది.’ అని తెలిపారు. యువన్ ఈ పాటను అద్భుతంగా పాడారని, ఇప్పటివరకూ విడుదలైన రెండు పాటలు ఒకెత్తయితే.. ఈ పాట మరో ఎత్తని, ఫుల్ రొమాంటిక్ జోష్లో ఈ పాట ఉంటుందని, కళాదర్శకుడు తోట తరణి ఈ పాట కోసం నాలుగు సెట్లు వేశారని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్.