కిషోర్, దియా జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమకథ’. శివశక్తి రెడ్డి దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్లుక్ను ఇటీవల ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ విడుదల చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన…సినిమా కాన్సెప్ట్ బాగుందని, తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘వినూత్న ప్రేమకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.
నేటి యువత మెచ్చే అన్ని అంశాలుంటాయి. ఫీల్గుడ్ లవ్స్టోరీగా మెప్పిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో థియేటర్స్లో విడుదల చేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వాసు పెండెం, సంగీతం: రథన్, నిర్మాతలు: విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్, రచన-దర్శకత్వం: శివశక్తి రెడ్డి.