వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి తెరకెక్కించిన ప్రేమకథ ‘డ్రింకర్సాయి’. ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటించారు. బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, లహరిధర్ బసవరాజు నిర్మాతలు. డిసెంబర్ 27న విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నదని మేకర్స్ చెబుతున్నారు. మంగళవారం హైదరాబాద్లో మీడియాకు ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. తాను అనుకున్న పాయింట్ ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యిందని, ఫలితం పట్ల అందరం ఆనందంగా ఉన్నామని, హీరోహీరోయిన్లతోపాటు ఇరవైమంది కొత్తవాళ్లను ఈ సినిమా ద్వారా పరిచయం చేశామని దర్శకుడు తెలిపారు. ఇప్పటివరకూ 5.75 కోట్ల గ్రాస్ను ఈ సినిమా కలెక్ట్ చేసిందని నిర్మాతలు తెలిపారు.