Prathinidhi-2 Movie | టాలీవుడ్ హీరో నారా రోహిత్ చాలా రోజుల గ్యాప్ తర్వాత నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రతినిధి 2’. తొమ్మిదేళ్ల కిందట ఆయన హీరోగా చేసిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్గా ఈ సినిమా వస్తుంది. సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్.
సీఎంను ఎందుకు చంపావు అంటూ మొదలైన ట్రైలర్లో నారా రోహిత్ను మొదట ఒక జర్నలిస్టుగా చూపించారు. ఆ తర్వాత సరికొత్త గెటప్పులో వృద్దుడిగా నారా రోహిత్ కనిపిస్తూ యాక్షన్ చేశారు. ఇక ”పవర్ మన చేతిలో ఉంటే కేసులన్నీ కోర్టులోనే ఉంటాయ్”. ”దేశాన్ని కాపాడ్డానికి ఒక సైనికుడు.. కడుపు నింపడానికి ఒక రైతు ఎంత ఇంపార్టెంటో సొసైటీ కి జర్నలిస్టు కూడా అంతే ఇంపార్టెంట్” అంటూ వచ్చిన డైలాగ్లు ట్రైలర్కే హైలైట్గా నిలిచాయి. ఫుల్ పొలిటికల్ ఎంటర్టైన్తో వస్తున్న ఈ ట్రైలర్ను మీరు చూసేయండి.
ఈ సినిమాను మే 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. వానరా ఎంటర్టైన్మెంట్స్ & రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.