టాలీవుడ్ (Tollywood) యాక్టర్ మహేశ్ బాబు (Mahesh Babu)నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). పరశురాం (Parasuram ) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక ఆసక్తికర వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. మహేశ్ బాబు సినిమా అంటే డైలాగ్స్ ఏ స్థాయిలో ఉంటాయో..చెప్పడానికి పోకిరి, అతడు, ఒక్కడు సినిమాలు చాలు. తనదైన శైలిలో కూల్ గా పంచ్ డైలాగ్స్ చెప్తూ థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించడం ఒక్క మహేశ్ తోనే సాధ్యమంటే అతిశయోక్తి కాదు.
మరోవైపు పరశురాం సినిమాలంటే కూడా ప్రత్యేకమైన శైలిలో సాగుతుంటాయి. ఇక సర్కారు వారి పాటలో ఈ దర్శకుడు పవర్ ఫుల్ పంచ్ లైన్స్ సిద్దం చేశాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. గత కొన్నేళ్లలో భారత్ లో సెన్సేషన్ సృష్టించిన బ్యాంకు మోసాలు, ఆర్థిక నేరాల నేపథ్యంలో..విజయ్ మాల్యా, నీరవ్ మోదీ అంశాలను టచ్ చేస్తూ ఈ సినిమా సాగనున్నట్టు ఇప్పటివరకున్న టాక్. కాగా సినిమా క్లైమాక్స్ లో దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించేలా మహేశ్ మార్కు సంభాషణలు ఉండబోతున్నాయట.
పరశురాం స్వతహాగా రైటర్ కావడంతో సమాజంలోని పేద, ధనిక వర్గాలను సృశిస్తూ కొన్ని సంభాషణలు సినిమాకే హైలెట్ గా నిలువతోతున్నాయన్న వార్త ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో కీర్తిసురేశ్ Keerthy Suresh హీరోయిన్ గా మారింది.
Sonu Sood: మరో ప్రాణాన్ని నిలబెట్టిన సోనూసూద్.. బిగ్ డే అంటూ ట్వీట్
Tiger 3 | సల్మాన్, కత్రినా పాట చాలా కాస్లీ గురూ..బడ్జెట్ ఎంతంటే..?
Vijay Deverakonda | ముంబైతో పోలిస్తే నేను సోమరి హైదరాబాదీని