Hanuman Movie | టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘హనుమాన్’. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటివరకు ఈ చిత్రం వరల్డ్వైడ్గా రూ.210 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇదిలావుంటే ఈ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్’ (Jai Hanuman) రానున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాలో హనుమంతుడిగా కనిపించబోయేది ఎవరంటూ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మొదట హనుమంతుడిగా టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కనిపించబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయంపై ప్రశాంత్ వర్మ స్పందించాడు. ‘జై హనుమాన్’లో హనుమంతుడిగా బాలీవుడ్ నటుడిని తీసుకోనున్నట్లు ప్రశాంత్ వర్మ వెల్లడించారు. ఇందుకు సంబంధించి బాలీవుడ్ హీరోల నుంచి ఆడిషన్స్ కూడా చేస్తున్నట్లు తెలిపాడు. త్వరలోనే హనుమంతుడిగా కనిపించబోయేది ఎవరో ప్రకటించనున్నట్లు తెలిపాడు.
ఇక ‘హనుమాన్’కు సీక్వెల్గా వస్తున్న ‘జై హనుమాన్ కు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధమయిపోయిందని ప్రశాంత్ వర్మ వెల్లడించాడు. దీంతో ప్రేక్షకులంతా సెకండ్ పార్ట్ ‘జై హనుమాన్’ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది.