Jai Hanuman | స్టార్ హీరో సినిమా పోటీలో ఉన్నా.. వాయిదా వేసుకోవాలని ఎంతమంది ఫోర్స్ చేసినా ప్రశాంత్ వర్మ తగ్గలేదు.. తన హనుమాన్ సినిమాను సంక్రాంతి బరిలో దింపాడు. జనవరి 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. దీంతో ఒక్కరోజు ముందుగానే.. అంటే ఇవాళ చాలాచోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రీమియర్ షోలు అనే బదులు సినిమా ఇవాళే రిలీజైందని అనుకోవచ్చు. ఆ రేంజ్లో ప్రీమియర్ షోలు వేశారు మరి! ఏదో పది ఇరవై థియేటర్లలో ప్రీమియర్ షో వేద్దామని అనుకుంటే.. సినిమాకు వచ్చిన హైప్తో దాదాపు 300 థియేటర్లలో ప్రదర్శించాల్సి వచ్చింది. ఒక్కరోజు ముందుగానే సినిమా చూసే అవకాశం రావడంతో ప్రేక్షకులు కూడా ఇవాళే థియేటర్లకు క్యూ కట్టారు. సినిమా చూసిన తర్వాత ప్రశాంత్ వర్మ తన సినిమా విషయంలో ఎందుకు అంత మొండిపట్టుతో ఉన్నాడో అర్థం చేసుకున్నారు.
హనుమాన్ సినిమా చూసిన ఆడియన్స్ చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అవుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియన్స్కు ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు వస్తున్న టాక్తో పాటు ఇప్పుడు మరో విషయం కూడా వైరల్గా మారింది. హనుమాన్ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. జై హనుమాన్ పేరుతో సెకండ్ పార్ట్ వస్తుందని సమాచారం. ఈ సినిమాను 2025 తీసుకొస్తరంట. హనుమాన్ సినిమా ఎండింగ్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ విషయాన్ని అనౌన్స్ చేసినట్లుగా ప్రీమియర్ షోలు చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. అంతేకాకుండా రాముడి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి? అనే అంశంపై ఈ సినిమా కొనసాగునుందని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి ఆడియన్స్ థ్రిల్గా ఫీలవుతున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న అప్పట్లో ఎంతలా ఫేమస్ అయ్యిందో.. అలాగే రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి? అనే కీవర్డ్ 2024లో అంత పాపులర్ అవుతుందని ఆడియన్స్ భావిస్తున్నారు.