‘హను-మాన్’ఫేం ప్రశాంత్వర్మ సినిమాటిక్ యూనివర్స్(PVCU) నుంచి వస్తున్న కాల్పినిక పౌరాణిక దృశ్యకావ్యం ‘మహాకాళి’. ప్రశాంత్వర్మ షోరన్నర్గా, పూజా కొల్లూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మాతలు. ఈ చిత్రం వందరోజుల షూటింగ్ను విజయవంతంగా పూర్తి చేసుకోగా, చివరి 40 రోజుల షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ సినిమాలో శుక్రాచార్యుడిగా కీలక పాత్రను బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ అక్షయ్ఖన్నా పోషిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్గా ఆయన.. తన భాగం చిత్రీకరణంతా పూర్తి చేశారు. మరోవైపు పలు స్టూడియోల్లో ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్టు నిర్మాతలు శనివారం ప్రకటన విడుదల చేశారు. ‘మహాకాళి’గా భూమిశెట్టి టైటిల్రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సురేష్ రగుతు, సంగీతం: స్మరణ్సాయి, నిర్మాణం: RKD స్టూడియోస్.