‘ది కశ్మీర్ ఫైల్స్’.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న సినిమా. ఈ చిత్రంలో కాశ్మీరీ పండిట్ల బాధను చూపించారు. ఈ సినిమాను వివేక్రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించాడు. అనుపమ్ ఖేర్ .. మిథున్ చక్రవర్తి .. పల్లవి జోషి ఈ సినిమాలో ప్రధానమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం కల్పిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఈ సినిమాకు పన్ను మినహాయింపు కూడా ఇచ్చాయి. అయితే, ఈ సినిమాపై విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ ట్విటర్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా గాయాలను మాన్పుతుందా.? తిరిగి రేపుతుందా.? ద్వేషమనే బీజాలను మళ్లీ నాటుతుందా.? అని ప్రకాశ్రాజ్ ప్రశ్నించారు. అలాగే జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు ప్రకాశ్రాజ్. కొంతమంది ఈ ట్వీట్కు మద్దతు తెలుపుతుండగా, మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు.
#kashmirifiles this propaganda film … is it healing wounds or sowing seeds of hatred and inflicting wounds #Justasking pic.twitter.com/tYmkekpZzA
— Prakash Raj (@prakashraaj) March 18, 2022