అక్టోబర్ 10న జరగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమరం ఎంత హాట్గా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ప్రకాశ్రాజ్,మంచు విష్ణు మధ్యే పోటీ ఆసక్తికరంగా ఉండనున్నట్టు తెలుస్తుంది. అయితే నామినేషన్ల పర్వం మొదలు కాగా, కొద్ది సేపటి క్రితం ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ సభ్యులతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్కు ప్రకాష్ రాజ్ అండ్ టీమ్ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈరోజు మధ్యాహ్నమే సీవీఎల్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మంచు విష్ణు రేపు(సెప్టెంబర్28)న మధ్యాహ్నాం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈనెల 29వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.
నామినేషన్స్ పరిశీలన 30 వరకు జరగనుంది. అక్టోబర్1-2 తేదీల్లో నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. కాగా, ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ సభ్యులని కొద్ది రోజుల క్రితం ప్రకటించగా వారిలో జయసుధ,శ్రీకాంత్, బెనర్జీ,సాయి కుమార్,తనీష్, ప్రగతి, అనసూయ, సన, అనిత చౌదరి, సుధ, అజయ్, నాగినీడు,బ్రహ్మాజీ, రవి ప్రకాశ్, సమీర్, ఉత్తేజ్, ఏడిద శ్రీరామ్, శివా రెడ్డి, భూపాల్, టార్జాన్, సురేష్ కొండేటి, ఖయ్యుం, సుడిగాలి సుధీర్,గోవింద రావు, శ్రీధర్రావు ఉన్నారు. అధ్యక్ష బరిలో నిలిచిన జీవిత,హేమలను తమ ప్యానెల్లో చేర్చుకోవడంతో బండ్ల గణేష్ బయటకు వచ్చి సొంతగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.