సరళీకృత ఆర్థిక విధానాలకు శ్రీకారం చుట్టి నవభారత నిర్మాణంలో కీలక భూమిక పోషించారు తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహారావు. బహుభాషావేత్తగా, రాజకీయ దురంధరుడిగా పేరుగాంచిన ఆయన జీవితంలోని కీలక ఘట్టాలను చర్చిస్తూ ‘హాఫ్ లయన్’ పేరుతో ‘ఆహా’ ఓటీటీ సంస్థ ఓ వెబ్సిరీస్ను తెరకెక్కించబోతున్నది. వినయ్ సీతాపతి రాసిన ‘హాఫ్ లయన్’ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ను రూపొందించబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, రాజకీయ చిత్రాల రూపకల్పనలో సిద్ధహస్తుడిగా పేరుపొందిన ప్రకాష్ఝా ఈ సిరీస్కు దర్శకత్వం వహిస్తారు. 2023లో తెలుగు, హిందీ, తమిళంలో ఈ సిరీస్ను విడుదల చేస్తారు. ప్రముఖ నిర్మాత, ‘ఆహా’ ప్రమోటర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘పీవీ నరసింహారావుగారి కథను ప్రపంచ ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో ఈ సిరీస్ను తెరకెక్కించబోతున్నాం’ అన్నారు. దర్శకుడు ప్రకాష్ఝా మాట్లాడుతూ ‘భారతదేశ పురోభివృద్ధికి బాటలు వేసిన పీవీ నరసింహారావుగారి జీవితం తాలూకు అంశాల్ని చర్చిస్తూ ఈ సిరీస్ చేయడం ఆనందంగా ఉంది. నేటితరం ఆయన గురించి తెలుసుకునేలా ఈ సిరీస్ను తీర్చిదిద్దుతాం’ అని చెప్పారు. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్తో కలిసి ‘ఆహా’ ఈ సిరీస్ను తెరకెక్కిస్తున్నది.