కెరీర్లో నాలుగు సార్లు నేషనల్ అవార్డు అందుకుంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut). ఈ భామ తెలుగులో చేసింది ఒక్క సినిమా. అది కూడా అప్పటి యంగ్ రెబల్ స్టార్, ఇప్పటి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)తో నటించిన ఏక్ నిరంజన్. 2009లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం మూడో తమిళ సినిమా చంద్రముఖి 2 షూటింగ్తో ఫుల్ బిజీగా ఉంది కంగనా రనౌత్.
కంగనా రనౌత్ ఇటీవలే ట్విట్టర్లో చిట్చాట్ సెషన్లో పాల్గొంది. స్టార్ యాక్టర్ ప్రభాస్తో ఉన్న స్వీట్ మెమొరీని షేర్ చేసుకోవాలని కంగనాని ఓ ఫాలోవర్ చిట్చాట్ సెషన్లో అడిగారు. దీనికి కంగనా స్పందిస్తూ.. ప్రభాస్ ఇంట్లో ఎప్పటికీ బెస్ట్ ఫుడ్ ఉంటుంది. ప్రభాస్ అద్భుతమైన హోస్ట్ అని సమాధానమిచ్చింది. కంగనా పొగడ్తలతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కంగనా రనౌత్ ప్రస్తుతం లీడ్ రోల్లో నటిస్తున్న ఎమర్జెన్సీ షూటింగ్ పూర్తయింది. ఈ హిందీ ప్రాజెక్ట్ విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ రానుంది.
మరోవైపు ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్-K, ఓం రౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు టాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నాడు. హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవికా మోహనన్ హీరోయిన్గా నటిస్తోంది.
Prabhas home has the best food ever … and he is a wonderful host #askkangana https://t.co/gmACXcPo1d
— Kangana Ranaut (@KanganaTeam) February 20, 2023