ఏపీలో టికెట్ ధరలు (AP Movie Ticket Prices) పెంపునకు సంబంధించిన జీవోపై టాలీవుడ్ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. టికెట్ల రేట్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేయాల్సి ఉండగా ఆలస్యమవుతూ వస్తోంది. అయితే రాధేశ్యామ్ మార్చి 11న విడుదల కాబోతున్న నేపథ్యంలో..హీరో ప్రభాస్ (Prabhas) చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. తాజాగా సినిమా టికెట్ ధరలపై స్పందించాడు ప్రభాస్. రాధేశ్యామ్ (Radhe Shyam) విడుదలకు ముందే ఏపీ ప్రభుత్వం జీవో ఇస్తే చాలా సంతోషిస్తానన్నాడు ప్రభాస్.
మరోవైపు సినిమా టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు సినిమా టికెట్ల జీవో జారీ చేయనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభాస్ కామెంట్లు టాక్ ఆఫ్ ది టౌన్గా మారాయి. టికెట్ల ధరల నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగానే ఏపీ సీఎం జగన్ చెప్పినట్లు..ఆయనతో భేటీ సందర్భంగా చిరంజీవి ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే.
టికెట్ల ధరల విషయంపై ఏపీ ప్రభుత్వం ఒక కమిటీని కూడా నియమించింది. ఏపీలో కొంత కాలంగా సినిమా టికెట్ల ధరల విషయం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.