పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కొత్త సినిమా సెట్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దర్శకుడు మారుతి రూపకల్పనలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రభాస్ ఈ మధ్య కాలంలో అటెంప్ట్ చేయని సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా ఉండబోతున్నది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నది. రొమాన్స్, థ్రిల్లింగ్ అంశాలు ఉంటూనే కంప్లీట్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తారట. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ నాయికగా ఎంపికవగా…మరో హీరోయిన్గా కోలీవుడ్ సుందరి మాళవిక మోహనన్ నటించనుంది. ఈ సినిమా మాళవికకు గ్రాండ్ టాలీవుడ్ ఎంట్రీ కానుంది. ఈ ఇద్దరు భామలతో ప్రభాస్ తెరపై సందడి చేయనున్నారు. ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి షెడ్యూల్ను దీపావళిలోపు పూర్తి చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నది. ఈ మినీ షెడ్యూల్ కోసం ప్రభాస్ వారం రోజుల పాటు డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. ఇదికాక ప్రభాస్ ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘సలార్’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.