ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. నవంబర్ నుంచి సెట్స్మీదకు వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం హారర్ కామెడీ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. ప్రభాస్ తొలిసారి ఈ జోనర్లో నటించడం విశేషం. కథానుగుణంగా ఈ చిత్రంలో నలుగురు నాయికలకు చోటుందని చెబుతున్నారు. బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ దెయ్యం పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది. ఈ సినిమా విషయంలో ప్రభాస్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, ఆయన తరహా యాక్షన్ అంశాలతో పాటు మారుతి శైలి కామెడీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని అంటున్నారు.