ప్రభాస్ హీరోగా పౌరాణిక కథాంశంతో రూపొందుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకుడు. రామాయణ గాథ ఆధారంగా వీఎఫ్ఎక్స్కు అధిక ప్రాధాన్యతనిస్తూ త్రీడీ సాంకేతికతతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ ఈ నెల 15 నుంచి హైదరాబాద్లో ప్రారంభంకానున్నట్లు సమాచారం. కరోనా ఉదృతి దృష్ట్యా ముంబయిలో సినిమా చిత్రీకరణలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో హైదరాబాద్కు లొకేషన్ను మార్చినట్లు తెలిసింది. ప్రత్యేకంగా సెట్స్ను నిర్మిస్తూ ఇక్కడే షూటింగ్ను పూర్తిచేయాలనే యోచనలో దర్శకుడు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రభాస్తో పాటు ఇతర తారాగణం అందుకు అంగీకరించినట్లు తెలిసింది. ఇప్పటికే 60 రోజుల షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.మరో మూడు నెలల్లో మొత్తం షూటింగ్ను పూర్తిచేసేందుకు దర్శకుడు ఓంరౌత్ ప్రణాళికల్ని సిద్ధంచేస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా కృతిసనన్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఈ సినిమా విడుదలకానున్నది.