స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త సినిమా ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్). ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, కేఎల్ నారాయణ, బీవీఎస్ఎన్ ప్రసాద్, ఏఎం రత్నం తదితరులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దిల్ రాజు చేతుల మీదుగా దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ అందజేశారు.
గ్యాంగ్స్టర్ కథతో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు వహిస్తుండగా..తమన్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా చిత్ర నిర్మాత స్పందిస్తూ… ‘ఇవాళ మా సంస్థ నిర్మాణంలో పవన్కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్ మూవీ ప్రారంభోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉంది. త్వరలోనే ఓ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఇవ్వబోతున్నాం’ అని అన్నారు. ఈ చిత్రంలోని నాయిక సహా ఇతర నటీనటులను త్వరలో ప్రకటించనున్నారు.