అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘నాతిచరామి’. ఈ చిత్రానికి నాగు గవర దర్శకత్వం వహించారు. శ్రీలక్ష్మీ ఎంటర్ప్రైజెస్ సమర్పణలో ఏ స్టూడియో 24 ఫ్రేమ్ ప్రొడక్షన్స్ పతాకంపై జై. వైష్ణవి కె నిర్మించారు.ఈ నెల 10న ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా విశేషాలను తాజాగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో చిత్రబృందం
వివరించారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ..‘వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. శ్రీలత పాత్రలో పూనమ్ కౌర్ నటన ఆకట్టుకుంటుంది. నాటకీయతతో సాగే కథ ఆకర్షణ అవుతుంది’ అన్నారు. ‘ఇక సినిమాలు వద్దు వెళ్లిపోదాం అని నిర్ణయించుకున్న సమయంలో ఈ చిత్ర అవకాశం వచ్చింది. పాండమిక్ వల్ల అసలు ఈ సినిమా విడుదల అవుతుందా అని సందేహించాం. ఇప్పుడు రిలీజ్కు సిద్ధమవడం సంతోషంగా ఉంది. ‘ఇందులో నేను చేసిన శ్రీలత పాత్ర అనేక భావోద్వేగాల చుట్టూ అల్లుకుని ఉంటుంది’ అన్నారు
నాయిక పూనమ్ కౌర్.