పంజాబీ ముద్దుగుమ్మ పూనమ్ కౌర్ ఈ మధ్య తరచు వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతుంది. 2006లో వచ్చిన ‘మాయాజాలం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అడపాదడపా సినిమాలలో నటించింది. ఏ సినిమా కూడా ఈ అమ్మడికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయింది. దీంతో చెల్లెలి పాత్రలలోను మెరిసింది. ప్రస్తుతం పూనమ్కి అవకాశాలు లేని నేపథ్యంలో ఈ అమ్మడు సంచలన ట్వీట్స్తో వార్తలలోకి ఎక్కుతుంది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే పూనమ్ కౌర్.. తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ను, తన అభిప్రాయాలను ఫాలోవర్స్తో, ఫ్యాన్స్తో పంచుకుంటూ ఉంటారు . ఈమె ఇన్డైరెక్ట్గా చేసే కొన్ని ట్వీట్స్ చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. తాజాగా ఆమె విడాకులపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే కాసేపటికే ఆ ట్వీట్ డిలీట్ చేయడంతో హాట్టాపిక్గా మారింది.
విడాకులు తర్వాత మగవారు ఏ మాత్రం బాధపడరా, ఆడవాళ్లే ఇబ్బందులు పడాలా?ఆడవాళ్లే వారిని మాటలతో బాధిస్తారు.. వారి వల్లే మగవారికి కఠిన పరిస్థితులు వస్తుంటాయని ఈ సమాజమే పక్షపాతంతో వ్యవహరిస్తుందా? విడాకుల అంశాన్ని ఇప్పటికీ మనం పూర్తి స్థాయిలో అర్ధం చేసుకోగలిగామా? విడాకుల కోణంపై మనకు కచ్చితమైన దృక్కోణం ఉందా?’ అని ఆమె పేర్కొంది. ఈ ట్వీట్ని కొద్ది సేపటికే డిలీట్ చేయడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.