అల వైకుంఠపురములో చిత్రంతో బుట్టబొమ్మగా పిలవబడుతున్న పూజా హెగ్డే ప్రస్తుతం తన హవా చూపిస్తుంది. తెలుగులోనే కాక తమిళం, హిందీ భాషలలోను సత్తా చాటుతుంది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే పలు విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. తాజాగా రెమ్యునరేషన్కి సంబంధించిన విషయంలో కరీనాను నెటిజన్స్ ట్రోల్ చేస్తుంటే తన వాదన వినిపించింది.
కరీనా కపూర్ త్వరలో రానున్న ఓ పాన్ ఇండియా మైథలాజికల్ సినిమాలో సీత పాత్ర పోషించేందుకు రూ.12 కోట్లు డిమాండ్ చేసిందట.ఈ క్రమంలో నెటిజన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ… కరీనాను ఆ సినిమా నుంచి తొలగించాలంటూ.. ‘బాయ్కాట్ బెబో’అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. దీంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు కరీనాకు మద్దతుగా నిలిచారు.
రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పూజా హెగ్డే.. కరీనాకు తన మార్కెట్ వాల్యూని బట్టి రెమ్యునరేషన్ డిమాండ్ చేసి ఉంటుంది. హీరోయిన్ల రెమ్యునరేషన్ గురించి మాట్లాడేవారు, హీరోలు పెద్ద మొత్తం డిమాండ్ చేస్తే ఎందుకు నోరు మెదపరని ప్రశ్నించింది. రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం నటుల హక్కు. అది ఇవ్వాలా వద్దా అనేది నిర్మాతల ఇష్టాఇష్టాలపై ఆధార పడి ఉంటుందని పూజా ఫేర్కొంది.