Pooja hegde | విభిన్న కథలను ఎంచుకుంటూ నటన ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ సినీరంగంలో దూసుకుపొతున్న నటి పూజా హెగ్డే. సౌత్ టు నార్త్ స్టార్ హీరోలందరితో నటిస్తూ అగ్ర శ్రేణి కథానాయికగా కొనసాగుతుంది. సౌత్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా పూజా నిలిచింది. ప్రస్తుతం ఈమె ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్ చిత్రంలో హీరోయిన్గా నటించింది. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్లను జోరుగా జరుపుకుంటుంది. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా పూజా హెగ్డే తన మనసులోని మాటలను బయటపెట్టింది.
రాధేశ్యామ్ ప్రచారంలో భాగంగా పూజా తనకు కమల్హసన్, ధనుష్, రణ్బీర్ కపూర్ వంటి బిగ్గెస్ట్ స్టార్స్తో కలిసి నటించాలనుంది అంటూ తన మనసులో మాటను బయపెట్టింది. రాధేశ్యామ్ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందు రానుంది. ఈ చిత్రంతో పాటు పూజా నటించిన బీస్ట్, ఆచార్య చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇవే కాకండా సర్కస్ అనే హిందీ చిత్రంతో పాటు త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబోలో తెరకెక్కనున్న #SSMB28 ప్రాజెక్ట్లో నటించనుంది.