టాలీవుడ్లో తన జోరు కొనసాగిస్తూనే ఉంది అందాల తార పూజా హెగ్డే. తాజాగా ఆమె ఖాతాలో మరో క్రేజీ మూవీ చేరింది. విజయ్ దేవరకొండతో దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందించనున్న కొత్త సినిమాలో నాయికగా పూజానే ఎంచుకున్నట్లు సమాచారం. గతంలో ఈ దర్శకుడు, హీరో కాంబినేషన్లో తెరకెక్కిన ‘గీత గోవిందం’ ఘన విజయాన్ని సాధించింది. విజయ్ దేవరకొండ కెరీర్కు గట్టి పునాది వేసింది. ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి ఈ ప్రాజెక్ట్పై క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాలోని క్యారెక్టర్కు పూజా హెగ్డే అయితే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నారట. పైగా ఈ కథకు ఇప్పటిదాకా కలిసి నటించని జంట కావాలని అనుకుంటున్నారని సమాచారం. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రకటించిన ‘జనగణమన’ ప్రాజెక్ట్లో పూజా నాయికగా నటించాల్సింది. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. దీంతో పూజా, విజయ్ జోడీ తెరపైకి రాలేదు. ఇప్పుడు ఈ చిత్రంతో వీరి జోడీ కుదిరింది. ఈ సినిమా ‘గీత గోవిందం’ చిత్రానికి సీక్వెల్గా ఉంటుందా? లేక పూర్తిగా కొత్త కథనా అనేది తెలియాల్సిఉంది. ప్రస్తుతం పూజా హెగ్డే.. మహేష్ బాబు సరసన ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తున్నది.