The Kashmir Files | మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’. వివేక్ అగ్నిహోత్రీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కాశ్మీర్ పండిట్లపై సాగిన సామూహిక హత్యకాండ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ‘రిపబ్లిక్ డే’ సందర్భంగా జనవరి 26న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ఇక తాజాగా ఈ చిత్రం మర్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
చిత్రం విడుదలైన మొదటి షో నుంచే పాజిటీవ్ టాక్ను తెచ్చుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్ర నిర్మాత అగర్వాల్, చిత్ర దర్శకుడు అగ్నిహోత్రీ, తన భార్య పల్లవి జోషి ప్రధాని మోడీని కలిసారు. ప్రధాని మోడీ సినిమాను, చిత్ర బృందంను అభినందించారు. 1990లో కాశ్మీర్ పండిట్లు ఏ విధంగా హింసించబడ్డారు? చంపబడ్డారు?అంతే కాకుండా స్వదేశం నుంచి బలవంతగా ఎలా బయటకు పంపబడ్డారు? అనే కథాంశంతో చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే 3.55 కోట్ల కలెక్షన్లను సాధించింది.
'THE KASHMIR FILES' TEAM MEETS PM MODI… #TheKashmirFiles producers #AbhishekAgarwal, #PallaviJoshi and #VivekRanjanAgnihotri [who has directed the film] met Hon. Prime Minister Shri #NarendraModi ji… The Prime Minister appreciated the team as well as the film. pic.twitter.com/OO27CsvT1n
— taran adarsh (@taran_adarsh) March 12, 2022