త్రిసూర్: కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని ఇవాళ ప్రధాని మోదీ(PM Modi) సందర్శించారు. కేరళ సంప్రదాయ దుస్తులైన ధోతి, శాలువ ధరించిన ఆయన.. తొలుత ఆలయంలో శ్రీకృష్ణుడి దర్శనం చేసుకున్నారు. తులాభారం కూడా చేశారు. ఆ తర్వాత ఆలయ పరిసరాల్లో ఫిల్మ్ హీరో సురేశ్ గోపి కూతురు భాగ్య సురేశ్ వివాహా మహోత్సవానికి హాజరయ్యారు. నూతన దంపతుల్ని ఆయన ఆశ్వీర్వదించారు. ఉదయం 8.45 నిమిషాలకు సురేశ్ గోపి కూతురి వివాహం జరిగింది. మమ్ముట్టి, మోహన్లాల్, దిలీప్, ఖుష్బూ కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకకు ముందు కొచ్చిలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు.
PM @narendramodi meets superstars Mohanlal and Mammootty while attending Suresh Gopi’s daughters wedding in Guruvayur… also blessed other couples at templepic.twitter.com/ctYsFpk5n9
— Akshita Nandagopal (@Akshita_N) January 17, 2024
గురువాయూర్, కందనాసరి, చూండిక ప్రాంతాల్లో ఇవాళ కాలేజీలు, స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ప్రధాని టూర్ సందర్భంగా గురువాయూర్ ఆలయంలో కూడా దర్శన వేళల్లో మార్పులు చేశారు. ఆలయం లో ఇవాళ కొన్ని పెండ్లిళ్లు ఉదయం 5 నుంచి 5 వరకు, ఆ తర్వాత మిగితా పెండ్లిళ్లు 9.30 తర్వాత నిర్వహించనున్నారు. ఉదయం 6 నుంచి 9 వరకు ఆలయ పరిసరాల్లో కఠిన ఆంక్షలు విధించారు.
Prayed at the sacred Guruvayur Temple. The divine energy of this Temple is immense. I prayed that every Indian be happy and prosperous. pic.twitter.com/eFpxWaa9BL
— Narendra Modi (@narendramodi) January 17, 2024
త్రిసూర్ జిల్లాలో ఉన్న త్రిప్రయార్ శ్రీ రామస్వామి ఆలయంలో ఇవాళ ప్రధాని మోదీ పూజలు చేశారు. వలప్పాడ్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో దిగిన మోదీ ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై 21 మంది వేద విద్యార్థులు రామాయణ భజనలు పాడారు. కేరళ ప్రజలు నాలంబాలమ్ యాత్రలో భాగంగా త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. అయోధ్యలో జనవరి 22వ తేదీన రాముడి ప్రాణ ప్రతిష్ట చేయనున్న నేపథ్యంలో త్రిప్రయార్లో మోదీ పర్యటన ప్రత్యేకత సంతరించుకున్నది. కొచ్చిన్ షిప్యార్డ్ రిపేరింగ్ సెంటర్ను ఆయన ప్రారంభించనున్నారు.
#WATCH | Kerala: Prime Minister Narendra Modi at Thriprayar Shree Ramaswamy Temple in Thrissur district. pic.twitter.com/Oxlb2i3ohS
— ANI (@ANI) January 17, 2024