విజయవంతమైన హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘పిజ్జా’. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు త్వరలో ‘పిజ్జా-3’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అశ్విన్ కాకుమణి, పవిత్ర మరిముత్తు ముఖ్యతారలుగా నటించిన ఈ చిత్రానికి మోహన్ గోవింద్ దర్శకుడు. ఇటీవల తమిళంలో విడుదలైన ఈ చిత్రం ఈ నెల 18న తెలుగులో విడుదల కానుంది.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో అశ్విన్ కాకుమణి మాట్లాడుతూ ‘ఇది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్. పూర్తి ఆసక్తికరమైన స్క్రీన్ప్లేతో ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా ఉంటుంది. తప్పకుండా తెలుగులో కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. ఈ చిత్రాన్ని మురళి, ఆశిష్ తెలుగులో విడుదల చేస్తున్నారు.