Pindam Movie | చాలా రోజుల గ్యాప్ తరువాత ఒకరికి ఒకరు (Okariki Okaru) ఫేమ్ శ్రీరామ్ (Sriram) నటిస్తున్న తాజా చిత్రం ‘పిండం’(Pindam). కుశీ రవి (Kushi Ravi) హీరోయిన్గా నటిస్తుండగా.. సాయికిరణ్ దైదా (Sai Kiran Daida) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సాయికిరణ్కు ఇదే మొదటి మూవీ. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
టాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas) ఈ సినిమాలో కీ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ నుంచి అవసరాల శ్రీనివాస్ ఫస్ట్ లుక్ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో అవసరాల ‘లోక్నాథ్’ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. సోఫాలో కూర్చొని తీక్షణంగా ఎవరినో చూస్తున్నట్లు ఈ పోస్టర్ ఉంది.
Introducing Avasarala Srinivas as Loknath from the world of #Pindam@saikirandaida @Yeshwan71014110 @Eswari_Rao1225#kalaahimedia #thescariestfilmever pic.twitter.com/RxBiF52Rty
— Vamsi Kaka (@vamsikaka) November 24, 2023
ఈ సినిమాను డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కళాహి మీడియా పతాకం (Kalahi Media Banner)పై యశ్వంత్ దగ్గుమాటి (Yashwanth Daggumaati) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీరామ్తో పాటు, ఈశ్వరీరావు, రవివర్మ, మాణిక్ రెడ్డి, బేబీ చైత్ర, బేబీ ఈషా, విజయలక్ష్మి, శ్రీలత తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ మారుమూల పల్లెటురిలో ఇల్లు, అందులో ఓ కుటుంబం, వాళ్లను భయపెట్టే ఆత్మ.. దీని చుట్టే కథ స్టోరీ ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఆత్మలను బంధించే మంత్రగత్తె పాత్రలో ఈశ్వరి రావు నటిస్తుండగా.. తన కుటుంబాన్ని ఆత్మ నుంచి రక్షించుకునే పాత్రలో శ్రీరామ్ కనిపించనున్నాడు. ఇక 1930 నుంచి 1990 వరకు మూడు టైమ్లైన్లలో ఈ సినిమా ఉండబోతున్నట్లు దర్శకుడు సాయికిరణ్ దైదా తెలిపాడు.