లాక్డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాలీవుడ్ చిత్రసీమకు మహారాష్ట్ర ప్రభుత్వం తీపికబురు వినిపించింది. ఈ నెల 7 నుంచి నిబంధనలతో షూటింగ్లను జరుపుకొనేందుకు అనుమతులిచ్చింది. కరోనా వ్యాప్తితో ఏప్రిల్ నెలలో హిందీ చిత్రసీమ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రస్తుతం వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అన్లాక్ ప్లాన్లో భాగంగా ఈ నెల ఏడు నుంచి తగు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్లు జరుపుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. సినిమా చిత్రీకరణలు బబుల్ విధానంలోనే జరగాలని పేర్కొన్నది. అలాగే ఎక్కువ జనసమూహంతో కూడిన సన్నివేశాలను చిత్రీకరించడాన్ని నిషేధించింది. ప్రతిరోజూ సాయంత్రం ఐదు గంటల వరకే షూటింగ్లు జరుపుకోవాలని, వారాంతపు రోజుల్లో షూటిం గ్స్ నిలిపివేయాలని ప్రభుత్వం సూచించింది.