చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించిన చిత్రం ‘పర్ఫ్యూమ్’. జేడీ స్వామి దర్శకుడు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డుగ్రహీత చంద్రబోస్ను చిత్ర బృందం ఘనంగా సన్మానించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘సరికొత్త పాయింట్తో ఈ చిత్రాన్ని రూపొందించాం.
స్మెల్ బేస్డ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ఇది. ఇప్పటివరకు తెలుగు తెరపై ఇలాంటి కథ రాలేదు’ అన్నారు. స్మెల్లింగ్ అబ్సెషన్ అనే కాన్సెప్ట్తో రూపొందించిన తొలి చిత్రమిదని, కథలోని మలుపులు ఉత్కంఠకు గురిచేస్తాయని, తన పాత్ర నెగెటివ్ ఛాయలతో సాగుతుందని హీరో చేనాగ్ తెలిపారు. ఈ చిత్రానికి జె.సుధాకర్, శివ బి, రాజీవ్ కుమార్, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని నిర్మించారు.