Mangalaavaram OTT | ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘మంగళవారం. టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్పూత్ ఇందులో కథనాయికగా నటించింది. స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా దీనిని నిర్మించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మిస్టీరియస్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 17న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా డైరెక్షన్ పరంగా అజయ్ భూపతికి మంచి మార్కులు పడ్డాయి. ఇక థియేటర్ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే ఈ సినిమా క్రిస్మస్ కానుకగా మంగళవారం రోజునే స్ట్రీమింగ్ కానుంది.
A Mangalvaaram to wait for 👀#MangalvaaramonHotstar Streaming from 26th Dec only on #DisneyPlusHotstar @DirAjayBhupathi @starlingpayal @Nanditasweta @AJANEESHB #SwathiGunupati #SureshVarmaM pic.twitter.com/TxfrO0gv00
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) December 24, 2023
ఈ సినిమా కథలోకి వెళితే.. ఒక ఊర్లో ప్రతి మంగళవారం అక్రమసంబంధం కలిగివున్న జంట భయంకరంగా హత్యకు గురవుతుంటారు. వారి బండారాన్ని ఓ అగంతకుడు ఊళ్లో ఏదో ఒక గోడమీద రాసి ఆ జంటను చంపుతుంటాడు. ఆ మిస్టరీని ఛేదించటానికి లేడీ ఎస్ఐ రంగంలోకి దిగుతుంది. కానీ ఊరు సహకరించదు. అసలు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో తెలుసుకోటానికి ఊరుఊరూ నడుంబిగించి రాత్రుళ్లు వెతకడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆ ఊరుకి సంబంధించిన ఓ కుర్రాడు గోడమీద రాస్తూ ఊరిజనానికి దొరికిపోతాడు. వాడ్ని తన్నీ స్టేషన్కి అప్పజెబుతారు. అయితే, మరణించిన శవాల పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం చంపింది ఆ దొరికిన కుర్రాడు కాదు. దాంతో అతడ్ని పోలీసులు వదిలేస్తారు. ఇంతకీ ఆ హత్యలకు కారణం ఏంటి? ఎవరు చంపుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలినకథ.